Saturday, 10 April 2021

కిడ్నీలో రాళ్లు

 #కిడ్నీలో_రాళ్లు_నవీన్_నడిమింటి_సలహాలు_పాటిస్తే_కరిగిపోతాయంతే...


              శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని నివారించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

 

1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి.

2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

 

3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.

 

4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు.

 

5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.

 

6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు  మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

 

7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2797261033872097/


#రాళ్లను_కరిగించే_ఔషధ_మొక్కలు


          ఆయుర్వేదంలో ఈ తరహా రాళ్లను మూత్రశ్మరి అని పిలుస్తారు. ఆశ్మ అంటే రాయి. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు నెమ్మదిగా  మూత్రనాళం లేదా మూత్రాశయంలోకి చేరి అక్కడ ఉండిపోతాయి. వీటిలో 85 శాతం మూత్రం ద్వారా బయటికి పోతాయి. అయితే రాళ్ల పరిణామం ఏడు మి.మీ కన్నా పెద్దగా ఉన్నప్పుడు మూత్రం ద్వారా బయటికి రావడం కష్టం అవుతుంది. అప్పుడే సమస్యలు ఎదురవుత


#తీసుకోవాల్సిన_జాగ్రత్తలు


         కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి రెండు లీటర్ల మూత్రం బయటకు వచ్చేలా నీటిని తీసుకోవాలి. చెమట అధికంగా ఉన్నప్పుడు మరింత నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.


మద్యపానం, కాఫీ, టీ, శీతలపానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలు, పాలకూర, మిరియాలు, బాదంపాలు, వేరుశనగలు, టమోట, నిమ్మజాతి పండ్లు, క్యాబేజీ, కాలీప్లవర్‌, మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కాల్షియం ఫాస్పేట్‌ వల్ల రాళ్లు ఏర్పడితే గోధుమపిండి, శనగపిండి, బఠాణీలను ఆహారంలో చేర్చకూడదు. 


శరీరాన్ని చురుగ్గా ఉంచాలి. వ్యాయమం, శరీరక శ్రమ, నడక అవసరం. అప్పుడే రాళ్లు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. పవన ముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం నిత్యం వేస్తే మంచిది. 


#మూలికలు_ఔషధాలు


         ఆరు నెలల పాటు రెండు పూటలా మూడు చెంచాల తులసి రసాన్ని తేనేలో కలిపి తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు బయటకు వచ్చే అవకాశముంది.


మొక్కజొన్న పొత్తులతో ఉండే పీచుని 40 గ్రాములు తీసుకుని అరలీటరు నీళ్లలో నానబెట్టి రెండు గంటల తరువాత తాగాలి. 


                 సంస్కృతంలో గోక్షుర, తెలుగులో పల్లేరు అని పిలిచే మూలిక ఈ సమస్యకు ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే పల్లేరు కాయల రసం లేదా కషాయం నిత్యం వాడితే మంచిది. 5 గ్రా ముల మొక్క లేదా కాయలకి ఎనిమిది రెట్లు నీటిని కలిపి నాలుగో వంతు మిగిలే వరకు కాచి గోరువెచ్చగా ఉండగానే తాగాలి.

ధన్యవాదములు

No comments:

Post a Comment