Saturday, 10 April 2021

గోమాత కసాయి

 ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు.....

గోవు వానిని చూసి నవ్వింది.


దాన్ని చూసి కసాయి అడిగాడు.

నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?

అని అడిగాడు.

.

అప్పుడు గోవు ఇలా చెప్పింది.

.

నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.

.

అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.

ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే 

నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.

.

పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.


పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.

నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.

అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.


ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.


కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....

నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.


ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.

నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.

కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.


నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.

శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.


నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?


నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే 


మీకు ,మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో 


మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..మీ కెక్కడి మనుగడ,అందుకే  


నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.


.***************************************************************************

(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ

ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)

జై గోమాత.🙏

So friends...... Share... చేయండి.....అందరికీ  గోమాత విశిష్టత తెలియజేయండి.

No comments:

Post a Comment